
నిమిషప్రియను మరణశిక్ష నుంచి తప్పించలేమని కేంద్రం ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు నివేదించిన తరువాత.. ఓ అద్భుతం జరిగింది. 24 గంటలు తిరక్కుండానే యెమెన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించి, ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా పడేలా చేయగలిగింది భారత ప్రభుత్వం. నిమిషకు ఉరిశిక్ష ఖరారైనప్పటి నుంచి నిత్యం సంప్రదింపులు చేస్తూనే వస్తోంది కేంద్రం. అక్కడి జైలు అధికారులతో, యెమెన్లోని ప్రాసిక్యూటర్ ఆఫీస్తో మాట్లాడుతూనే ఉంది. కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే.. కొలిక్కి రాలేదీ మ్యాటర్. ప్రతీ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు ఎంత ముఖ్యమో చెప్పిన ఓ కేస్ స్టడీ ఇది. భారత్కు ఇంటర్నేషనల్గా పవర్ ఉంది కదా.. యెమెన్ ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయింది ఇంతకాలం అనే సందేహం రావడం సహజం. కాని, అన్ని దేశాల్లా కాదు యెమెన్. 2014 ముందు వరకు యెమెన్తో మంచి సంబంధాలే ఉన్నాయి. 2015లో హౌతీ రెబల్స్ తిరుగుబాటు చేయడం, ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలవడంతో ఆ రిలేషన్స్ అన్నీ తెగిపోయాయి. యెమెన్కు భారతీయులెవరూ వెళ్లొద్దని రాకపోకలు కూడా నిలిపివేసింది భారత ప్రభుత్వం. 2015 ఏప్రిల్లో యెమెన్ రాజధాని సనాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సైతం అక్కడి నుంచి తరలించింది. సో, ఆ దేశంతో సంప్రదింపులు చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సరిగ్గా అలాంటి సమయంలో కేసులో ఇరుక్కుపోయింది ఈ కేరళ నర్సు నిమిష ప్రియ. ఒక మనిషిని చంపడం కచ్చితంగా తప్పే. ఆ కోణంలో నిమిష చేసింది...