పాకిస్తాన్ లో పేలుడు ఘటన..ఉగ్రవాది హఫీజ్ సయీద్ టార్గెట్.. జర్నలిస్ట్ వెల్లడి…

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఇటీవల జరిగిన పవర్ ఫుల్ బ్లాస్ట్ లో ముగ్గురు మరణించగా..ఓ పోలీసు కానిస్టేబుల్ సహా 24 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు కరడు గట్టిన ఉగ్రవాది జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే జరిగింది.

పాకిస్తాన్ లో పేలుడు ఘటన..ఉగ్రవాది హఫీజ్ సయీద్ టార్గెట్.. జర్నలిస్ట్ వెల్లడి...
Terrorist Hafiz Saeed

Edited By:

Updated on: Jun 29, 2021 | 4:21 PM

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఇటీవల జరిగిన పవర్ ఫుల్ బ్లాస్ట్ లో ముగ్గురు మరణించగా..ఓ పోలీసు కానిస్టేబుల్ సహా 24 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు కరడు గట్టిన ఉగ్రవాది జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే జరిగింది. 15 కేజీల పేలుడు వస్తువులతో కూడిన కారును ఈ ఇంటి సమీపంలో ఉంచి పేల్చివేశారు. నిజానికి హఫీజ్ సయీద్ ని టార్గెట్ చేసుకునే ఈ దాడి జరిపారని, ఆ సమయంలో హఫీజ్ తన ఇంటిలోనే ఉన్నాడని అంజాద్ సయీద్ సహానీ అనే జర్నలిస్టు తెలిపాడు. అతనిపైనే ప్రధానంగా గురి పెట్టారని, జైలు అధికారులు ఇతని లొకేషన్ ని ఎప్పుడూ మానిటర్ చేస్తుంటారని ఆయన చెప్పాడు. ఈఘటన జరిగినప్పుడు సయీద్ తమ ఇంట్లో లేడని అతని కుటుంబం చెపుతున్నా అది అబద్దమని ఆయన పేర్కొన్నాడు. లష్కరే తోయిబా చీఫ్ గా కూడా చెప్పుకుంటున్న హఫీజ్..ని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి, అమెరికా ఇదివరకే పేర్కొన్నాయి. ఇతని తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.

2008 లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు ఇతడే సూత్రధారి అని ఇండియా పలుమార్లు ఆరోపించింది. ఆ దాడుల్లో 161 మంది మరణించగా వేలమంది గాయపడ్డారు. హఫీజ్ సయీద్ కి పాకిస్తాన్ లో రెండుసార్లు జైలు శిక్ష విధించారు. అయితే ఇతడిని జైల్లో పెట్టకపోవడంతో లాహోర్ లోని తన ఇంటి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. కాగా ఇతడిని ఎవరు టార్గెట్ చేశారన్నది ఇంకా ఇదమిథంగా తెలియలేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2022: కొత్త ఫ్రాంచైజీల కనీస విలువ రూ.2000 కోట్లు..! జులైలో విక్రయానికి రెడీ?

Moderna vaccine: ఇక త్వరలో దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్.. డీజీసీఐ అనుమతే తరువాయి… అమెరికా ఓకె…