South Africa Floods: దక్షిణాఫ్రికాలో వరదల బీభత్సం.. 400 మంది మృతి.. 40 వేల మంది నిరాశ్రయులు!

దక్షిణాఫ్రికా వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అత్యంత ఘోరమైన విపత్తులో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

South Africa Floods: దక్షిణాఫ్రికాలో వరదల బీభత్సం.. 400 మంది మృతి.. 40 వేల మంది నిరాశ్రయులు!
South Africa Floods

Updated on: Apr 17, 2022 | 4:10 PM

South Africa Floods: దక్షిణాఫ్రికా వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అత్యంత ఘోరమైన విపత్తులో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆగ్నేయ తీర నగరమైన డర్బన్‌లోని కొన్ని ప్రాంతాలలోకి నీరు ప్రవేశించింది. రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. ఈ వరదలో ఆసుపత్రి ఇళ్లు ధ్వంసమయ్యాయి.వందలాది మంది జనం నీటిలో కొట్టుకుపోయారు.

ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 398కి చేరుకోగా, 27 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం శనివారం సమాచారం ఇచ్చింది. 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లలో చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. పోలీసుల నుంచి సైన్యం, వాలంటీర్ల వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెస్క్యూ టీమ్ ప్రకారం, డర్బన్ జిల్లాలో తప్పిపోయిన కుటుంబానికి చెందిన 10 మందిలో ఇప్పటివరకు ఒకరి ఆచూకీ కూడా లభించలేదు.

డర్బన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. మొదటి వరదలు సంభవించిన 6 రోజుల తర్వాత, ప్రాణాలతో బయటపడే అవకాశం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. తప్పిపోయిన బంధువుల ఆచూకీ కోసం ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం అత్యవసర సహాయ నిధిలో ఒక బిలియన్ ర్యాండ్ ($68 మిలియన్లు) ప్రకటించింది. అదనంగా, ఆఫ్రికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధిపతి పాట్రిస్ మోట్‌సేప్ 30 మిలియన్ ర్యాండ్ ($2.0) ప్రకటించారు.

Read Also…  Ayurveda Helath Tips: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు దివ్య ఔషధం.. అరటిపండు నెయ్యి మిశ్రమం