WHO DG: మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏ దేశమైనా మర్చిపోకూడదు.. వంద రోజుల్లో అన్ని దేశాలకు టీకాలు
WHO DG: ఏడాది కాలంగా కరోనా మహమ్మారి భయపెడుతుంది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రాణాలతో చెలగాటమాడింది...
WHO DG: ఏడాది కాలంగా కరోనా మహమ్మారి భయపెడుతుంది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రాణాలతో చెలగాటమాడింది. కోవిడ్ మహమ్మారి కొత్త మ్యుటేషన్ కారణంగా ప్రపంచం మరోసారి భయభ్రాంతులకు గురవుతోంది. వైరస్ను కట్టడి చేసేందుకు భారత్తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్ర స్థాయిలో కృషి చేశాయి. ఇక భారత్లో శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి విడత టీకా అందించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల ప్రాప్యతపై న్యాయంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కోరారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి దేశంలో టీకాలు వేయడం చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు. వంద రోజుల్లో అన్ని దేశాల్లో టీకా వేయడం ప్రారంభించి పూర్తి చేయాలి. తద్వారా ఆరోగ్య కార్యకర్తలు, అధిక ప్రమాదం ఉన్న వారు రక్షించబడతారు అని ఆయన అన్నారు.
జెనీవా నుంచి ఆయన వర్చువల్ మీడియా సమావేశంలో టెడ్రోస్ ప్రసంగించారు. మధ్య, తక్కువ ఆదాయ దేశాలు వైరస్ నుంచి సమానంగా రక్షించే విధంగా ప్రయత్నాలు కొనసాగాలని ఆయన సూచించారు టీకాలు వేయడం ప్రారంభించిన వారిలో అధిక ఆదాయ దేశాలు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలను ఏ దేశమైనా మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. అన్ని ఆరోగ్య సేవలు అందుబాటులో లేని ఖండం నుంచి వచ్చిన తనకు ఆరోగ్య సమస్యలు అంటే ఏమిటో పూర్తిగా తెలుసని ఆయన అన్నారు.