కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాను (China) వైరస్ వీడడం లేదు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చాలా నగరాలు ఇప్పటికీ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే ఎంత జాగ్రత్త పడుతున్నా వైరస్ భయం మాత్రం వెళ్లడం లేదు. అక్కడ మనుషులకే కాదు, చేపలు, పీతలకూ కొవిడ్ టెస్ట్లు చేస్చుండటం సంచలనంగా మారింది. చైనాలో జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించేందుకు డ్రాగన్ ప్రభుత్వం జీరో కొవిడ్ (Zero Covid) పాలసీ ని పాటిస్తోంది. బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో రోజుల తరబడి లాక్డౌన్లు విధించింది. లక్షలాది మందిని అధికారులు క్వారంటైన్కు తరలించారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని క్వారంటైన్ జోన్గా మార్చేసి కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిబంధనలు అమలు చేసింది. కర్ఫ్యూ ఆంక్షలూ విధించడంతో ప్రజలు ఆహారం దొరకక ఆకలికి అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారీగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో అధికారులు చేపట్టిన చర్యలు ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. తినే ఆహారం నుంచి కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందంటూ మనుషులతో పాటు సీ ఫుడ్కు కూడా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జియామెన్ నగరంలోని నాన్వెజ్ మార్కెట్లో PPE కిట్ ధరించిన వైద్య సిబ్బంది అక్కడి చేపలు, పీతలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
సోషల్ మీడియాతో పాటు, సౌత్ చైనా మార్నింగ్లో ఈ వీడియోస్ వైరల్గా మారాయి. అధికారుల అతి చర్యల కారణంగా కొవిడ్ టెస్ట్ కిట్స్ మీద పెట్టే ప్రజాధనం వృధా అవుతోందని జనం విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే మత్స్యకారుల కారణంగా చేపలకు పీతలకు కూడా కొవిడ్ సోకే అవకాఃం ఉన్నందున ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించడంలో తప్పేమీ లేదని అధికారులు చెబుతుండటం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం