Bhoganandishwara Temple: జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం.. అందంగా ముస్తాబవుతున్న ఆలయాలు, స్మారక చిహ్నాలు
భారత దేశం తన సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రపంచ గురువుగా మారుతుంది. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇవ్వనున్నది. దేశంలోని అన్ని స్మారక చిహ్నాలు ఈ వేడుకలకు సాక్ష్యంగా నిలవనున్నాయి.
Updated on: Dec 10, 2022 | 12:16 PM

భారత దేశం తన సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రపంచ గురువుగా మారుతుంది. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇవ్వనున్నది. దేశంలోని అన్ని స్మారక చిహ్నాలు ఈ వేడుకలకు సాక్ష్యంగా నిలవనున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంలో అనేక స్మారక చిహ్నాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

2023లో జి20 సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్కు దక్కింది. ఈ కార్యక్రమం బెంగళూరులో జరగనుంది. ఈ కారణంగానే దేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన.. యునెస్కో జాబితాలో ఉన్న ఆలయాలకు ప్రత్యేక లైటింగ్ ను ఏర్పాటు చేశారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నందిగిరి దేవాలయం దిగువన ఉన్న చారిత్రాత్మక శ్రీ భోగానందేశ్వర దేవాలయం కలర్ పుల్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ ఆలయ దీపాలంకరణ చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఆలయంలోని అరుణాచలేశ్వరుడు, భోగనందీశ్వర్ గోపురాలతోపాటు లోపలి ప్రాంగణానికి కలర్ పుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.

భోగనందీశ్వర ఆలయ గోడలు, మందిరం, మండపం, ప్రాంగణంలోని అన్ని ఆలయాలు, ఆరుబయట స్మారక చిహ్నాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

రంగురంగుల లైటింగ్లో ఆలయ శిల్పకళా సౌందర్యం డ్రోన్ కెమెరాలో బంధించబడింది. ఈ ఆలయ సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని కామెంట్ చేస్తున్నారు అంతేకాదు.. ఇప్పుడు ఏర్పాటు చేసిన లైటింగ్ను ఏడాది పొడవునా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.

సమ్మిట్లోని సభ్యదేశాల ప్రముఖులు ఆలయాలను, స్మారక చిహ్నాలను సందర్శించే వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ గొప్ప వారసత్వం, గొప్ప చరిత్రను తెలిసేలా ఆలయం అందంగా కనువిందు కలిగించేలా అలంకరించారు.





























