Russia Coal mine Accident: రష్యాలో ఘోర ప్రమాదం.. బొగ్గుగనిలో మంటలు.. 50 మందికి పైగా మృతి!

|

Nov 26, 2021 | 9:49 PM

రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మైనర్లు చనిపోయారని అక్కడ సజీవంగా మిగిలిన ఒక గార్డు చెప్పాడు.

Russia Coal mine Accident: రష్యాలో ఘోర ప్రమాదం.. బొగ్గుగనిలో మంటలు.. 50 మందికి పైగా మృతి!
Russia Coal Mine
Follow us on

Russia Coal mine Accident: రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మైనర్లు చనిపోయారని అక్కడ సజీవంగా మిగిలిన ఒక గార్డు చెప్పాడు. స్థానిక ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గని కెమెరోవో (కెమెరోవో ప్రాంతం)లో ఉంది. కెమెరోవో గవర్నర్ సెర్గీ సివిలోవ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ, సజీవంగా దొరికిన వ్యక్తి నైరుతి సైబీరియాలోని లిస్ట్‌వ్యాజ్నాయ గనిలో దొరికాడు. అతనిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు.

తాత్కాలిక అత్యవసర మంత్రి అలెగ్జాండర్ చుప్రియన్ మాట్లాడుతూ గనిలో సజీవంగా ఉన్న వ్యక్తి గార్డుగా పనిచేస్తున్నాడు. అతను చనిపోయాడని అందరూ భావించారు. గురువారం నాడు 14 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. 11 మంది మైనర్లు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ముగ్గురు రక్షకులు గని మారుమూల భాగంలో చిక్కుకున్న ఇతరుల కోసం వెతకె ప్రయత్నంలో మరణించారు. శుక్రవారం ఉదయం మరో ఆరు మృతదేహాలను వెలికితీయగా, 31 మంది గల్లంతయ్యారు. ఈ సమయంలో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడం చాలా అసాధ్యమని గవర్నర్ సివిలీవ్ అన్నారు.

మీథేన్ గ్యాస్ పేలుడు తర్వాత మంటలు..

గనిలో మంటలు చెలరేగిన కొన్ని గంటల తర్వాత, మంటల నుండి మీథేన్..కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలైనందున గార్డ్స్ శోధనను (రష్యా కోల్ మైన్‌లో ఫైర్) నిలిపివేయవలసి వచ్చింది. కెమెరోవో అధికారులు చెబుతున్న దాని ప్రకారం, మొత్తం 239 మందిని గని నుండి రక్షించారు. వీరిలో 63 మంది శుక్రవారం ఉదయం వరకు వైద్య సహాయం కోసం పంపించారు. అధికారిక వార్తా ఏజెన్సీలు టాస్, ఆర్ఐఏ నోవోస్టి అత్యవసర సేవల అధికారులను ఉటంకిస్తూ మిగిలినవారి మనుగడపై ఎటువంటి ఆశ లేదని చెప్పారు. సాయంత్రం నాటికి మరణించిన వారి సంఖ్య 52కి చేరినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఒకరు సజీవంగా కనిపించడంతో మృతుల సంఖ్య 51కి చేరింది.

మూడు రోజుల సంతాప దినాలు..

ఈ ప్రమాదంతో ప్రాంతీయ అధికారులు మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం (సైబీరియా కోల్ మైన్ బ్లాస్ట్) కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంపై రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ నేర విచారణను ప్రారంభించింది. గని డైరెక్టర్‌తో పాటు ఇద్దరు సీనియర్ మేనేజర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో గనిని తనిఖీ చేసిన రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి శుక్రవారం మరో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

Vladimir Putin: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..