Bus Accident: హైవేపై బస్సు బోల్తాపడి 27 మంది దుర్మరణం.. మరో 20 మందికి గాయాలు.. ఎక్కడంటే..

జరిగిన ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 

Bus Accident: హైవేపై బస్సు బోల్తాపడి 27 మంది దుర్మరణం.. మరో 20 మందికి గాయాలు.. ఎక్కడంటే..
Accident

Updated on: Sep 18, 2022 | 3:17 PM

Bus Accident: చైనాలో ఘోరో ప్రమాదం జరిగింది. చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. జరిగిన ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.  క్షతగాత్రులను హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించినట్టుగా అక్కడి అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం సంధూ ప్రావిన్స్‌ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి