ఇరాక్ ఆందోళన హింసాత్మకం.. 13 మంది మృతి.. 70 మందికి గాయాలు!
ఇరాక్లోని నాసిరియాలో గురువారం జరిగిన నిరసనల నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. భద్రతా దళాలు కాల్పులు జరిపి, బాష్ప వాయువును ఉపయోగించి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలు ఎక్కువగా ఉద్యోగాలు, అవినీతి ముగింపు, ప్రజా సేవల నేపథ్యలో జరుగుతున్నాయి. అశాంతిని అరికట్టడానికి, సేవలను పునరుద్ధరించడానికి సైనిక “క్రైసిస్ సెల్స్” లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇరాక్ సైన్యం ప్రకటించింది. “సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ ప్రధాన మంత్రి అడెల్ […]
ఇరాక్లోని నాసిరియాలో గురువారం జరిగిన నిరసనల నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. భద్రతా దళాలు కాల్పులు జరిపి, బాష్ప వాయువును ఉపయోగించి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలు ఎక్కువగా ఉద్యోగాలు, అవినీతి ముగింపు, ప్రజా సేవల నేపథ్యలో జరుగుతున్నాయి.
అశాంతిని అరికట్టడానికి, సేవలను పునరుద్ధరించడానికి సైనిక “క్రైసిస్ సెల్స్” లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇరాక్ సైన్యం ప్రకటించింది. “సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ ప్రధాన మంత్రి అడెల్ అబ్దేల్ మహదీ ఆదేశాల మేరకు, భద్రత మరియు సైనిక దళాలను నిర్దేశించడానికి మరియు నియంత్రించడానికి మరియు వారి మిషన్లో గవర్నర్లకు సహాయం చేయడానికి కొంతమంది మిలిటరీ కమాండర్లను ఈ యూనిట్కు నియమించారు” అని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రధానంగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇరాక్ యొక్క అంతర్గత వ్యవహారాల్లో పెరుగుతున్న ఇరాన్ జోక్యంపై.. నిరసనలలో పాల్గొన్న వారిలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నజాఫ్ నగరంలో ఇరాన్ కాన్సులేట్ పై దాడి చేశారు.