ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్

ఏపీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రాజెక్ట్& ఆపరేషన్స్‌ సెక్షన్‌లో ఉన్న అమరావతి నిర్మాణం అనే ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘డ్రాప్డ్’ అంటూ పెట్టేసింది. అయితే దీనిపై ప్రపంచ బ్యాంక్ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మానవ హక్కుల ఫోరమ్ అధికారి రోహిత్ గుత్తా మాట్లాడుతూ.. ‘‘నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ […]

ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 11:36 AM

ఏపీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రాజెక్ట్& ఆపరేషన్స్‌ సెక్షన్‌లో ఉన్న అమరావతి నిర్మాణం అనే ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘డ్రాప్డ్’ అంటూ పెట్టేసింది. అయితే దీనిపై ప్రపంచ బ్యాంక్ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మానవ హక్కుల ఫోరమ్ అధికారి రోహిత్ గుత్తా మాట్లాడుతూ.. ‘‘నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘ఇన్ పైప్‌లైన్’ అని ఉండేది. అయితే ఇవాళ అందులో ‘డ్రాప్డ్’ అని పెట్టారు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ అంశంపై ఏపీ సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహన్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై ప్రపంచ బ్యాంక్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రుణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రుణాన్ని తీసుకువచ్చేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని భావించాం’’ అని పేర్కొన్నారు. అయితే అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016లో ప్రపంచ బ్యాంక్‌‌కు  ఓ వినతి పత్రాన్ని పంపింది. అందులో భాగంగా 300మిలియన్ డాలర్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది. అలాగే మరో 200మిలియన్ డార్లు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే రాజధాని కోసం తమ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆ మధ్యన కొందరు రైతులు ప్రపంచ బ్యాంక్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేశారు. దీంతో రుణ ప్రక్రియ నిలిచిపోయింది.

అయితే ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దేశ గర్వించదగ్గ రాజధానిగా అమరావతిని నిర్మించాలనుకున్నారు. అయితే రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని, అక్కడి పంట భూములు బీడుగా మారుతాయని, దాదాపు 20వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని పలువురు సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో