Virat Kohli Warns NZ: ‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!
Virat Kohli Angry Moment: కివీస్ పర్యటనలో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైంది. రెండు టెస్టుల్లోనూ ఫ్లాప్షో ప్రదర్శించి వైట్వాష్ను ఎదుర్కొంది. పేపర్పై చూడడానికే భారత్ బలమైన జట్టని.. ఇలాంటి సిరీస్ ఎదురైతే ఖచ్చితంగా లోపాలు బహిర్గతం అవుతాయని మరోసారి రుజువైంది. ఏది ఏమైనా టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన వరుసగా రెండు పరాజయాలను చవి చూసింది. అయితే రెండో టెస్టులో కొంతమేరకు టీమిండియా పోరాడినా.. అది గెలుపుకు ఏమాత్రం సరిపోలేదు. మిడిల్ ఆర్డర్ మరోసారి […]
Virat Kohli Angry Moment: కివీస్ పర్యటనలో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైంది. రెండు టెస్టుల్లోనూ ఫ్లాప్షో ప్రదర్శించి వైట్వాష్ను ఎదుర్కొంది. పేపర్పై చూడడానికే భారత్ బలమైన జట్టని.. ఇలాంటి సిరీస్ ఎదురైతే ఖచ్చితంగా లోపాలు బహిర్గతం అవుతాయని మరోసారి రుజువైంది. ఏది ఏమైనా టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన వరుసగా రెండు పరాజయాలను చవి చూసింది. అయితే రెండో టెస్టులో కొంతమేరకు టీమిండియా పోరాడినా.. అది గెలుపుకు ఏమాత్రం సరిపోలేదు. మిడిల్ ఆర్డర్ మరోసారి విఫలం కావడంతో.. కివీస్ సునాయాసంగా విజయం సాధించింది.
అటు ఈ టెస్టులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం స్లిప్స్లో క్యాచ్ అందుకున్న కోహ్లీ.. న్యూజిలాండ్ ప్లేయర్లను ఉద్దేశించి ‘కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు లెక్కలు సరి చేస్తామని’ ఘాటుగా ఘాటుగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ‘జబ్ ఇండియా మే యే లోగ్ అయేంగే తబ్ ధికా దుంగా’ అంటూ కోపం అన్నాడట. 2019లో ‘స్పిరిట్ అఫ్ క్రికెట్’ అవార్డు అందుకున్న కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇదొక్కటే సందర్భంగా కాదు మొదటి ఇన్నింగ్స్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఔట్ అయినప్పుడు కూడా కోహ్లీ ప్రేక్షకులను వైపు తిరిగి నోటి మీద వేలు ఉంచి దుర్భాషలాడాడు. ఇక ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ కోహ్లీని అడగ్గా.. అతనికి కూడా విరాట్ ఘాటుగా సమాధానమిచ్చాడు.
For More News:
ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్న్యూస్.. తెలంగాణలో బ్యాడ్న్యూస్…
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…
ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు..
సాఫ్ట్వేర్కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్స్పేస్..!