Coronavirus Outbreak: ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు..
Coronavirus Outbreak: ఏపీలోని విజయవాడలో కరోనా కలకలం చెలరేగింది. జర్మనీ నుంచి ఓ వ్యక్తికీ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. విజయవాడకు చెందిన లక్ష్మారెడ్డి కొద్దికాలంగా జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతవారం హైదరాబాద్లో ప్రాజెక్ట్ పని మీద వచ్చి.. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతడ్ని ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్ వార్డుకు తరలించి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు పూర్తి స్థాయి పరీక్షలు కోసం శాంపిల్స్ను పూణే, సికింద్రాబాద్లకు […]
Coronavirus Outbreak: ఏపీలోని విజయవాడలో కరోనా కలకలం చెలరేగింది. జర్మనీ నుంచి ఓ వ్యక్తికీ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. విజయవాడకు చెందిన లక్ష్మారెడ్డి కొద్దికాలంగా జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతవారం హైదరాబాద్లో ప్రాజెక్ట్ పని మీద వచ్చి.. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతడ్ని ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్ వార్డుకు తరలించి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు పూర్తి స్థాయి పరీక్షలు కోసం శాంపిల్స్ను పూణే, సికింద్రాబాద్లకు పంపించారు. కాగా, కరోనా వైరస్పై ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు పనిచేసే ఈ నెంబర్కు 0866-2410978 కాల్ చేయాలని సూచించింది.
For More News:
ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్న్యూస్.. తెలంగాణలో బ్యాడ్న్యూస్…
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…
సాఫ్ట్వేర్కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్స్పేస్..!