Coronavirus In AP: కోనసీమలో కరోనా కలకలం..!
Coronavirus Latest News: తెలంగాణలో కరోనా పాజిటివ్ తెలిందన్న కొద్దిగంటల్లోనే కోనసీమలో కలకలం మొదలైంది. దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల విధుల్లో భాగంగా అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్కు వచ్చాడు. ఆ తర్వాత స్వగ్రామం చేరుకున్నాడని తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని అధికారులు అతడి […]
Coronavirus Latest News: తెలంగాణలో కరోనా పాజిటివ్ తెలిందన్న కొద్దిగంటల్లోనే కోనసీమలో కలకలం మొదలైంది. దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల విధుల్లో భాగంగా అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్కు వచ్చాడు. ఆ తర్వాత స్వగ్రామం చేరుకున్నాడని తెలుస్తోంది.
ఇక విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని అధికారులు అతడి వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డికి అందజేశారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ సిబ్బంది వాడపాలెం చేరుకున్నారు. బాధితుడు దగ్గరలోనే ఉన్న తన అత్తగారిల్లు గోదశివారిపాలెం వెళ్లినట్లు గుర్తించారు. దీనితో అధికారులు అక్కడికి వెళ్లి బాధితుడిని కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, అతడికి కరోనా సోకిందా లేదా అన్న విషయాలను నిర్ధారించాల్సి ఉందని వారు వెల్లడించారు.
For More News:
ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్న్యూస్.. తెలంగాణలో బ్యాడ్న్యూస్…
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…
ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు..
సాఫ్ట్వేర్కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్స్పేస్..!