AP News: రన్నింగ్ ఆర్టీసీ బస్సులో యువకుడి సూసైడ్
ఏం కష్టం వచ్చిందో ఏమో ఆ యువకుడు రన్నింగ్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మార్గమధ్యంలో యువకుడు ఉరికి వేలాడటాన్ని గమనించిన తోటి ప్రయాణికులు.. షాక్ తిన్నారు. వెంటనే బస్సు కండెక్టర్, డ్రైవర్కు విషయం చెప్పారు.
శ్రీకాళహస్తిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. రన్నింగ్ ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేసింది. పల్లె వెలుగు బస్లో వెనకాల కూర్చున్న యువకుడు ఉరి వేసుకున్నాడు. ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన కడ్డీకి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

