ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
పశ్చిమాసియాలో రణరంగం 26వ రోజుకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుబడుతోంది. తాము విధించిన కఠిన షరతులకు ఒప్పుకోవాలని అమెరికాకు ఇరాన్ గట్టి అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్పై విధించిన అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేయడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆంక్షలు విధించకూడదని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా, యుద్ధం వల్ల ఇరాన్కు వాటిల్లిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి భారీ పరిహారం చెల్లించాలని, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది.తమపై అమెరికా వేసే ప్రతి బాంబుకూ గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అయితే, ఇరాన్ పెడుతున్న ఈ షరతులు అత్యంత “హాస్యాస్పదంగా, అవాస్తవికంగా” ఉన్నాయని అమెరికా అధికారులు కొట్టిపారేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.పశ్చిమాసియాలో నెత్తురు చిందిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ‘15 పాయింట్ల శాంతి ప్రణాళిక’ను ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదనేది ప్రధాన నిబంధనగా ఉంది. దీంతో పాటు ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను గణనీయంగా తగ్గించుకోవాలని, అణ్వస్త్ర తయారీకి ఉపయోగపడే యురేనియం నిల్వలను అప్పగించాలని ట్రంప్ సూచించారు. ప్రస్తుతం వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య నేరుగా చర్చలు జరగకపోయినప్పటికీ, పాకిస్థాన్ మరియు ఒమన్ వంటి మధ్యవర్తుల ద్వారా ఈ సందేశాలను ఇరు దేశాలు పరోక్షంగా పంచుకుంటున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ ఈ కఠిన షరతులకు తలొగ్గాల్సిందేనని అమెరికా స్పష్టం చేస్తోంది.
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు

