దుబాయ్లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదును నిర్మిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దుబాయ్లో సందర్శకుల సంఖ్యను పెంచడానికి చేస్తున్న కృషిలో భాగమే అంటున్నారు అధికారులు. ప్రార్థనా మందిరం నీటి అడుగున ఉంటుంది. 50 నుంచి 75 మంది వరకు భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. 5.5 కోట్ల దర్హామ్లు అంటే సుమారు రూ. 125 కోట్లతో నీటిపై తేలియాడే మసీదును ప్రభుత్వం నిర్మిస్తోంది.
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదును నిర్మిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దుబాయ్లో సందర్శకుల సంఖ్యను పెంచడానికి చేస్తున్న కృషిలో భాగమే అంటున్నారు అధికారులు. ప్రార్థనా మందిరం నీటి అడుగున ఉంటుంది. 50 నుంచి 75 మంది వరకు భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. 5.5 కోట్ల దర్హామ్లు అంటే సుమారు రూ. 125 కోట్లతో నీటిపై తేలియాడే మసీదును ప్రభుత్వం నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మసీదును సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ మసీదును మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ వాటర్ కెనాల్ వద్ద ఈ ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మసీదు మిరేట్స్లో ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారుతుందని, ప్రార్థనల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న నీటిలో తేలియాడే ప్రార్థనా మందిరాన్ని సందర్శించేందుకు సందర్శకులు లక్షల్లో విచ్చేస్తారని ఆశిస్తోంది దుబాయ్ ప్రభుత్వం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ గోడౌన్లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!
ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్కి నెటిజన్లు ఫిదా
టివీ చూస్తున్నతండ్రి.. పెగ్ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్లో ఎడిటింగ్ మరింత ఈజీ..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

