WITT: రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదు.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని ప్రజలను పేదరికంలో ఉంచడానికి గత పాలకులు ఇష్టపడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు కాస్త ముట్టచెప్పి తమ చేతులు దులుపుకునే వారని అన్నారు. దీని వల్ల దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు పుట్టుకొచ్చాయన్నారు. అయితే తమ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల మీద కాకుండా సుపరిపాలనపై దృష్టిసారించినట్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఇదే మా మంత్రం, ఇదే మా ఆలోచన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నారు. గత ప్రభుత్వాలకు భారతీయతపై నమ్మకం లేదని ఆరోపించారు.
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

