WITT: రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదు.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని ప్రజలను పేదరికంలో ఉంచడానికి గత పాలకులు ఇష్టపడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు కాస్త ముట్టచెప్పి తమ చేతులు దులుపుకునే వారని అన్నారు. దీని వల్ల దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు పుట్టుకొచ్చాయన్నారు. అయితే తమ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల మీద కాకుండా సుపరిపాలనపై దృష్టిసారించినట్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఇదే మా మంత్రం, ఇదే మా ఆలోచన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నారు. గత ప్రభుత్వాలకు భారతీయతపై నమ్మకం లేదని ఆరోపించారు.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

