Tirumala: తిరుమల కొండపై నీటి కష్టాలు.! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా.!

తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరవు ఛాయలు అలముకున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 70,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోండటం, బ్రహ్మోత్సవాలు సమీపిస్తోండటం వంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా..

Tirumala: తిరుమల కొండపై నీటి కష్టాలు.! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా.!

|

Updated on: Aug 26, 2024 | 9:20 AM

తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరవు ఛాయలు అలముకున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 70,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోండటం, బ్రహ్మోత్సవాలు సమీపిస్తోండటం వంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బుధవారం (ఆగస్టు 21) ఒక ప్రకటనలో కోరింది. నీటి పొదుపునకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతానికి ఇకపై 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపింది. వ్యాపార సముదాయాలకు ఇకపై 24 గంటల నీటి సరఫరా ఉండదని.. రోజులో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు మొత్తం కలిపి రోజులో 8 గంటలు మాత్రమే వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేస్తామని తెలిపింది. ఆగస్టు 25 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

వ్యాపార సముదాయాలకు ఈ పరిధికి మించి నీటి అవసరం ఉంటే, తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాలని.. ఇందుకోసం విజిలెన్స్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలలో స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చేందుకు, రానున్న రోజుల్లో తిరుమలకు వచ్చే సందర్శకుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. నీటిని అనవసరంగా వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని భక్తులకు, స్థానికులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

అయితే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అక్టోబర్‌ 4 నుంచి 12 వ తేదీ వరకు. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలను పెద్ద ఎత్తున భక్తులు సందర్శించనున్న నేపథ్యంలో ముందే టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే నీటి వృథాను అరికట్టి నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా భక్తులు, స్థానికులకు నీటిని పొదుపుగా వాడాలని సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్‌ డెలివరీ.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌
7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్‌ డెలివరీ.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌
35 బంతుల్లో ముక్కలైన సౌతాఫ్రికా.. కట్‌చేస్తే.. ఊహించని పరాజయం
35 బంతుల్లో ముక్కలైన సౌతాఫ్రికా.. కట్‌చేస్తే.. ఊహించని పరాజయం
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
ఫ్యూచర్ బ్రాడ్‌మాన్‌‌గా పేరు.. బీసీసీఐ దెబ్బకు అజ్ఞాతంలోకి
ఫ్యూచర్ బ్రాడ్‌మాన్‌‌గా పేరు.. బీసీసీఐ దెబ్బకు అజ్ఞాతంలోకి
ఇకపై తిరుపతి కొత్త బస్టాండ్.. రంగంలోకి దిగిన కేంద్రం
ఇకపై తిరుపతి కొత్త బస్టాండ్.. రంగంలోకి దిగిన కేంద్రం
హీరోయిన్ ప్రియాంక మోహన్ పై ఫ్యాన్స్ సీరియస్..
హీరోయిన్ ప్రియాంక మోహన్ పై ఫ్యాన్స్ సీరియస్..
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!