అబ్బో.. పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
శ్రీశైలం రిజర్వాయర్కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీతోపాటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం, 10రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండిపోయి.. శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ 100 టిఎంసిల మైలురాయిని దాటింది.
శ్రీశైలం రిజర్వాయర్కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీతోపాటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం, 10రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండిపోయి.. శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ 100 టిఎంసిల మైలురాయిని దాటింది. 215 టీఎంసీలకుగాను ఇప్పటికే వంద టీఎంసీలు చేరడం, వరద నీరు కారణంగా రోజుకు 20 టీఎంసీలు వరకు వరదనీరు వచ్చి చేరుతోంది. మరోవారం రోజుల్లో రిజర్వాయర్ నిండటం ఖాయంగా కనిపిస్తోంది. అటు తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజుల్లో కర్నూలు మీదుగా శ్రీశైలం చేరనుంది. అటు కృష్ణ, ఇటు తుంగభద్ర నదుల వరద ప్రవాహం శ్రీశైలం చేరుతుండటంతో తాగు, సాగు, విద్యుత్ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

