ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. కొత్త తరహా మోసం
వరంగల్ లో ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ఏసీబీ అధికారులమని నమ్మించి, ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుండి ఆన్లైన్ ద్వారా రూ.10 లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు. అరెస్ట్ బెదిరింపులతో మొదట రూ.2 లక్షలు, మరుసటి రోజు మరో రూ.8 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బాధితుడు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. వరంగల్ లో ఇటీవల జరిగిన ఘటనలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారుల పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు ఒక ఆర్టీఏ (Road Transport Authority) అధికారిని మోసగించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) గా విధులు నిర్వర్తిస్తున్న అధికారిని లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు రూ.10 లక్షలు కొట్టేశారు. దుండగులు తమను ఏసీబీ అధికారులుగా పరిచయం చేసుకుని ఎంవీఐకి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు వస్తున్నామని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన ఎంవీఐ, వెంటనే ఆన్లైన్ ద్వారా రూ.2 లక్షలు బదిలీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీ కేర్ ఫుల్..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
Heavy Rains: భారీ వర్షాలతో.. ఉప్పొంగుతున్న కపిలతీర్థం జలపాతం
రూ.కోట్లు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే.. నెగెటివ్ రివ్యూలు ఇస్తారా
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

