భారీ వర్షాలతో.. ఉప్పొంగుతున్న కపిలతీర్థం జలపాతం
ఆంధ్రప్రదేశ్ను వాయుగుండం టెన్షన్ పెడుతోంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి, పీలేరులో రోడ్లు జలమయం కాగా, కపిలతీర్థం జలపాతం ఉప్పొంగుతోంది. లోతట్టు ప్రాంతాలు, మాడ వీధులు నీటమునిగాయి. టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ను వాయుగుండం ప్రభావం తీవ్రంగా కలవరపెడుతోంది. దీని నేపథ్యంలో, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షం కురిసింది. తిరుపతిలోనూ, అన్నమయ్య జిల్లాలోని పీలేరులోనూ కుండపోత వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. పీలేరు ఆర్టీసీ బస్ స్టేషన్ ప్లాట్ఫామ్లపైకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తిరుపతిలోని నాలుగు మాడ వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.కోట్లు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే.. నెగెటివ్ రివ్యూలు ఇస్తారా
ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సిద్ధమవుతోన్న నిర్మాతలు
కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

