చలి మంట దగ్గర లొల్లి… తలలు పగిలేలా కొట్టుకున్నారు

Updated on: Dec 16, 2025 | 7:33 PM

వరంగల్ చెరువుకొమ్ము తండాలో అర్ధరాత్రి చలిమంట దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు రెచ్చగొట్టుకోవడంతో కర్రలు, కాలుతున్న కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.

గ్రామాల్లో చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ తరహా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలోని చెరువుకొమ్ము తండాలో ఇటీవల అర్ధరాత్రి జరిగిన ఘర్షణ ఇందుకు తాజా ఉదాహరణ. ఈ ఘటన చలిమంట దగ్గర మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ వైరం తీవ్రం కావడంతో ఒకరిని రెచ్చగొట్టేలా మరొకరు ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కోపంలో ఇరువర్గాలు కర్రలతో పాటు కాలుతున్న కట్టెలతోనూ పరస్పరం దాడి చేసుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండిపెండెంట్ అభ్యర్థి అర్జున్ పై హత్య యత్నం

ట్రంప్‌ వెర్రి.. వీసా వర్రీ.. కఠిన నిబంధనలు గురించి తప్పక తెలుసుకొండి

మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్‌ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్‌

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌…భారీగా తగ్గిన బంగారం ధరలు

Loading...
Unable to load recommendations.
Follow Us