ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో
ఒక ఆటోలో ఎంతమంది ప్రయాణించగలరు? నలుగురు లేదా ఆరుగురు. మహా అంటే ముందు, వెనుక కలిపి ఓ 10 మంది వరకూ ప్రయాణిస్తారు. నిజానికి ఆటోలో ఇంతమంది ప్రయాణించడం సురక్షితం కాదు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు పెడచెవిన పెడతారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 19 మందిని ఆటోలో ఎక్కించుకొని పోలీసులకే షాకిచ్చాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు ఆపారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు. అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కపెట్టారు. మొత్తం ఆటోలోంచి 19 మంది ప్రయాణికులు దిగారు. అంతమంది ఆటోలో ప్రయాణించడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు. ఓర్నీ.. అది ఆటోనా.. ఆర్టీసీ బస్సా అంటూ కామెంట్లు చేశారు.

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్ చేసి..వీ
