తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్‌ !! కారణం తెలిస్తే షాక్‌ అవుతారు ??

ఓ సాధారణ వ్యక్తికి బాడీ గార్డులు ఉండటం మీరెప్పుడైన చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఓ తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డ్స్​ఉన్నారు.

తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్‌ !! కారణం తెలిస్తే షాక్‌ అవుతారు ??

|

Updated on: Jul 23, 2022 | 8:51 PM

ఓ సాధారణ వ్యక్తికి బాడీ గార్డులు ఉండటం మీరెప్పుడైన చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఓ తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డ్స్​ఉన్నారు. వ్యాపారి రామేశ్వర్​బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే47 గన్స్‌తో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్​ బాడీగార్డ్స్‌ను చూసి షాక్‌ అవుతున్నారు. చిరు వ్యాపారి అయిన రామేశ్వర్‌ ఓ తోపుడు బండిపై చిన్నారులు, మహిళల దుస్తులను పెట్టుకుని.. వివిధ ప్రాంతాలకు నడుచుకుంటూ.. వెళ్లి వ్యాపారం చేసుకుంటారు. అయితే రామేశ్వర్ గత కొద్ది రోజుల క్రితం తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ని కలిశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జుగేంద్ర సింగ్.. తనను కులం పేరుతో దూషించారని పోలీస్ స్టేషన్లో రామేశ్వర్ ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్లారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..

కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Follow us