Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trains Cancelled: నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?

Trains Cancelled: నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?

Anil kumar poka

|

Updated on: Jun 18, 2024 | 11:50 AM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్ లో సిగ్నల్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్ లో సిగ్నల్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లే బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీ కొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిగ్నల్ వ్యవస్థను రైల్వే ఆధునికీకరిస్తోంది.

జూన్‌ 17 నుంచి జూలై 6 వరకు కాజీపేట-కాగజ్‌నగర్ రైలు రద్దు చేశారు. అలాగే, జూన్‌ 23 నుంచి జూలై 6 వరకు కాగజ్‌ నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 23,25,30, జూలై 2,7 తేదీల్లో చెన్నై-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 21,23,28,30, జూలై 5 న జైపూర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 27,29,, జూన్‌ 4, 6 తేదీల్లో మైసూర్‌-జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 26, జూలై 3 న యశ్వంత్‌పూర్‌-లక్నో రైలు రుద్దు చేయబడింది. జూన్‌ 28, జూలై 5 తేదీల్లో లక్నో-యశ్వంత్‌పూర్‌ రైలు రద్దయింది. జూన్‌ 28, జూలై 5 న భాగమతి-మైసూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 25, జూలై 2 న బిలాస్‌పూర్‌-త్రివేండ్రం తరునల్వేలి ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 23, 30 తేదీల్లో త్రివేండ్రం-బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. జూన్‌ 21,28, జూలై 5 తేదీల్లో పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో రైళ్లు రద్దు చేశారు. జూన్‌ 24, జూలై 1,8 తేదీల్లో శ్రీమాతా వైష్ణో-పాటలీపుత్ర రైళ్లు రద్దు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.