Church: 70 వేల ఎముకలు, అస్తిపంజరాలతో చర్చి నిర్మాణం.. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన బోన్ చర్చ్..
భయం, భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండిటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. అదే ఓస్కూరీ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇందులోకి అడుగు పెట్టగానే వేలాది అస్తిపంజరాలు
భయం, భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండిటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. అదే ఓస్కూరీ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇందులోకి అడుగు పెట్టగానే వేలాది అస్తిపంజరాలు స్వాగతం పలుకుతాయి. యూరప్ దేశమైన చెక్ రిపబ్లిక్ కుట్నాహోరాలోని సెడ్లెక్లోఈ చర్చ్ ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. 1278లో సెడ్లెక్లోని సిస్టెర్సియన్ మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా కు పంపాడు. గోల్గోతా అంటే.. సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. అప్పటినుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మంది పైనే మృతి చెందారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

