Crime: ప్రెగ్నెన్సీ కిట్‌తో రావాలని ప్రియుడిని కోరిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!(వీడియో)

ఖుష్బూను ఆమె ప్రేమికుడు రాహుల్ కుమార్ ప్రజాపతి అలియాస్ బిట్టు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఖుష్బూ వితంతువు కావడంతో రైల్వేలో కారుణ్య నియామకం లభించింది. ఒడ్వార్ గ్రామానికి చెందిన రాహుల్ భార్య

Crime: ప్రెగ్నెన్సీ కిట్‌తో రావాలని ప్రియుడిని కోరిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!(వీడియో)

|

Updated on: Oct 08, 2022 | 9:40 AM


వివాహేతర సంబంధాలు చివరకు ఎక్కడికి దారి తీస్తాయో ఎవరూ ఊహించలేరు. అయితే వీటిలో చాలావరకు విషాదాంతాలుగానే మిగిలిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైల్వే ఉద్యోగిణి హత్య వ్యవహారం వెనుక అసలు కారణం కూడా అనైతిక సంబంధమే అని పోలీసుల విచారణలో తేలింది. చందౌలీ జిల్లాలోని మొఘల్‌సరాయ్ కొత్వాలి ప్రాంతంలో మహిళా రైల్వే ఉద్యోగి ఖుష్బూ హత్యకు సంబంధించి పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఖుష్బూను ఆమె ప్రేమికుడు రాహుల్ కుమార్ ప్రజాపతి అలియాస్ బిట్టు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఖుష్బూ వితంతువు కావడంతో రైల్వేలో కారుణ్య నియామకం లభించింది. ఒడ్వార్ గ్రామానికి చెందిన రాహుల్ భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఖుష్బూపై రాహుల్ ఒత్తిడి తెచ్చినా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఖుష్బూ రాహుల్‌కు ఫోన్ చేసి తాను గర్భవతి అయ్యానని, ప్రెగ్నెన్సీ కిట్‌తో తనను కలవాలని రాహుల్‌ని పిలిచింది. రాహుల్ ఇంటికి రాగానే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఖుష్బూ గొంతు నులిమి చంపిన రాహుల్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల అధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాహుల్ కుమార్ ప్రజాపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Follow us