Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం

పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం

Phani CH

|

Updated on: Nov 12, 2024 | 9:05 PM

పూల కుండీల్లో పూల చెట్లు పెంచితే ఏం కిక్కు అనుకుంది ఆ జంట. ఏకంగా కిక్కుకే కిక్కు ఇచ్చే గాంజాయి మొక్కలు పెంచింది. అంతేనా.. తమ ఇగురం చూడండి అంటూ ఫొటులో దిగి ఫేస్‌ బుక్‌లో పెట్టేశారు. ఇంకేముందు అత్యుత్సాహంతో అడ్డంగా బుక్ అయ్యారు. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ జంట తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, ఇటీవల ఉర్మిళ తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేశారు. ఐతే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు. 54 గ్రాములు ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. దంపతులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు.. ఎలా అంటే ??

ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్

Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా

Pushpa 2: మాస్ జాతర షురూ.. అభిమానులను కలవనున్న పుష్ప

ఆ రైల్లో వెళ్తున్నారా… బీ కేర్ ఫుల్ !!