24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్ మరోసారి తీవ్ర భూకంపాలతో వణికిపోయింది. తైవాన్ తూర్పు తీరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 80 భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్లో ఎక్కువ భూకంప కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది.
తైవాన్ మరోసారి తీవ్ర భూకంపాలతో వణికిపోయింది. తైవాన్ తూర్పు తీరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 80 భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్లో ఎక్కువ భూకంప కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది. అయితే ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఏప్రిల్ 3న తైవాన్లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 14 మంది మరణించారు. అప్పటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది. ఏప్రిల్ 3న సంభవించిన భూకంపంతో హువాలియన్లో ఓ పక్కకు ఒరిగిపోయిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో మరింతగా దెబ్బతిందని అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్.. ఇప్పుడు అల్లు అర్జున్.. ఏంది మావా ఇది
మానేరు వాగుపై 2016లో ప్రారంభమైన వంతెన నిర్మాణం.. అప్పుడే కుప్పకూలిందిగా
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

