రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!
మెదక్ జిల్లా రామాయంపేటలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నిబడిన మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నిబడిన మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రామాయం పేట మండలం సుత్తార్పల్లికి చెందిన రాగి రాజమణి అనే మహిళ భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్తున్నారు. దారిలో స్థానికి ఎస్బీఐ బ్యాంక్లో నగదు డ్రా చేసుకునేందుకు భర్త బ్యాంకులోపలికి వెళ్లగా.. మహిళ బ్యాంకుముందు తమ వాహనం వద్ద నిలబడి ఉంది. ఇంతలో హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ పక్కనే కాసేపు నిలబడి, ఏదో సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ.. ఒక్కసారిగా మహిళ మెడలోని మూడు తులాల గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ పెనుగులాటలో మహిళ ముందుకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటే ట్యాలెంట్.. కరెంట్ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు
వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్ రూపంలో !!
‘నువ్వు వర్జిన్వేనా’.. లైవ్ చాటింగ్లో ఆన్సర్ !!
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో
మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

