Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌

బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌

Phani CH
|

Updated on: Jun 18, 2025 | 6:25 PM

Share

ఇటీవల ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు కురవడంతో పుట్టల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేసి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య పాముల సయ్యాటలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ జంటపాములు సయ్యాటకు దిగుతూ జనాలను కట్టిపడేస్తున్నాయి.

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఆర్డీవో ఆఫీసు ఆవరణలో జంటపాములు హల్‌చల్‌ చేశాయి. తాజాగా నిర్మల్‌ జిల్లాలో జంటపాములు కనిపించాయి. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్‌ రోడ్డు పక్కన పంటచేలో రెండు పాములు సయ్యాటలో మునిగిపోయాయి. రోడ్డుపైన వెళ్తున్న వాహనాల రణగొణ ధ్వనులు కూడా వాటికి వినిపించలేనంతగా ఒకదానినొకటి పెనవేసుకొని తన్మయత్వంలో మునిగిపోయాయి. వాటిని గమనించిన స్థానికులు, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే

తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం