AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Phani CH
|

Updated on: Aug 22, 2024 | 9:22 PM

Share

సాధారణంగా మనుషులు దేవుడిమీద భక్తితో ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజలు చేస్తారు. ఇటీవల కాలంలో పశుపక్ష్యాదులు కూడా ఆలయాలను సందర్శిస్తున్నాయి. మొన్నామధ్య ఓ శునకం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలం సమీపంలో ఓ శివలింగానికి నాగుపాము చుట్టుకొని శివునిపై తన భక్తిని చాటుకుంది.

సాధారణంగా మనుషులు దేవుడిమీద భక్తితో ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజలు చేస్తారు. ఇటీవల కాలంలో పశుపక్ష్యాదులు కూడా ఆలయాలను సందర్శిస్తున్నాయి. మొన్నామధ్య ఓ శునకం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలం సమీపంలో ఓ శివలింగానికి నాగుపాము చుట్టుకొని శివునిపై తన భక్తిని చాటుకుంది. అది చూసి భక్తులంతా శివుని మహిమేనని పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నాగదేవత అంటూ దర్శనం చేసుకున్నారు. తాజాగా ఓ రామాలయంలో నాగుపాము హల్చల్‌ చేసింది. విశాఖ జిల్లా మల్కాపురం శ్రీరాముని ఆలయంలో భక్తులు పూజలో నిమగ్నమయ్యారు. భక్తులతో పూజారి పూజలు చేయిస్తున్నారు. ఇంతలో భక్తులలో కలకలం రేగింది. ఒక్కసారిగా అందరూ అక్కడినుంచి పరుగులంకించుకున్నారు. ఏం జరిగిందని పూజారి అటు చూడగా ఆలయ ప్రాంగణంలో ఓ పెద్ద నాగుపాము పడగ విప్పి నిల్చొని భక్తుల పూజలను తిలకిస్తోంది. అది చూసి పూజారి భక్తులను భయపడవద్దని చెప్పి, వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యారచ్‌ నాగుపామును బంధించి సురక్షితంగా అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు పెరిగిన ఏసీల వినియోగం

వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌.. మునుపెన్నడూ చూడని విధంగా

స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్‌ సేఫేనా ??

TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు

Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్