Viral: ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.
ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా సౌదీ ఎయిర్లైన్స్ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. దాంతో విమానంలో ఉన్న 297 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్లో జరిగింది. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి.
ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా సౌదీ ఎయిర్లైన్స్ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. దాంతో విమానంలో ఉన్న 297 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్లో జరిగింది. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. రియాద్ నుంచి పెషావర్ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తింది. దీంతో ఒక టైర్ నుంచి పొగలు వ్యాపించాయి.
దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే విమానాన్ని రన్వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. విమానం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పొగలను నియంత్రించారు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్లైన్స్ ధృవీకరించింది. విమానం ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు దిగుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

