రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు
పన్ను ఎగవేత ఆరోపణలతో పొగాకు కంపెనీ బంశీధర్ గ్రూప్పై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు ఆదాయంలో తప్పుడు లెక్కలను గుర్తించారు. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్తో సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఆ గ్రూప్ వారసుడు శివమ్ మిశ్రా ఇల్లును అధికారులు తనిఖీ చేసారు. ఆయన నివాసం ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉంది. మిశ్రా ఇంట్లో 50 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని, మెక్లారెన్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, పోర్షా వంటి లగ్జరీ కార్లను గుర్తించారు.
పన్ను ఎగవేత ఆరోపణలతో పొగాకు కంపెనీ బంశీధర్ గ్రూప్పై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు ఆదాయంలో తప్పుడు లెక్కలను గుర్తించారు. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్తో సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఆ గ్రూప్ వారసుడు శివమ్ మిశ్రా ఇల్లును అధికారులు తనిఖీ చేసారు. ఆయన నివాసం ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉంది. మిశ్రా ఇంట్లో 50 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని, మెక్లారెన్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, పోర్షా వంటి లగ్జరీ కార్లను గుర్తించారు. రూ.4.5 కోట్ల నగదు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ కుంభకోణం వెనక అసలు నిందితుడు ఆ గ్రూప్ అధినేత కేకే మిశ్రా అని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ రూ.20 నుంచి రూ.25 కోట్ల టర్నోవర్ను ప్రకటించగా.. వాస్తవంగా ఆ మొత్తం రూ.100 నుంచి రూ.150 కోట్లమేర ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

