ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్పోర్ట్లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
1987-88 మధ్య కాలంలో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ్ సీరియల్ను ఎప్పటికీ మర్చిపోలేం. రామాయణ మహాకావ్యాన్ని తొలిసారి ఎంతో అద్భుతంగా బుల్లితెరపై ఆవిష్కరించారు రామానందసాగర్.
1987-88 మధ్య కాలంలో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ్ సీరియల్ను ఎప్పటికీ మర్చిపోలేం. రామాయణ మహాకావ్యాన్ని తొలిసారి ఎంతో అద్భుతంగా బుల్లితెరపై ఆవిష్కరించారు రామానందసాగర్. అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సీరియల్. పాత్రధారులు ఎంతో అద్భుతంగా నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. రాముడిపాత్రలో అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చిఖాలియా ఎంతో చక్కగా ఒదిగిపోయారు. ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో జనం టీవీలకు హారతి ఇచ్చే వారంటే అతిశయోక్తి కాదు. ఇది కోట్లాది మంది భారతీయుల్లో భక్తి భావనను తట్టి లేపింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక ధారవాహికగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రామాయణ్ చోటు దక్కించుకుంది. 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ రామాయణ్ సీరియల్ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఎప్పటికీ మర్చిపోరు కూడా. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఈ సంఘటన. రామాయణ్ సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ని ఇప్పటికీ రామునిగా భావించి భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు ప్రజలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

