AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్‌గాల్స్‌ కావాలా నాయనా !! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెసేజ్‌ !! సీన్ కట్ చేస్తే

కాల్‌గాల్స్‌ కావాలా నాయనా !! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెసేజ్‌ !! సీన్ కట్ చేస్తే

Phani CH
|

Updated on: Jul 26, 2022 | 8:41 AM

Share

అర్ధరాత్రి యువకుడికి వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది.. ఓపెన్ చేసి చూడగా.. అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.. వెంటనే మరో మెసేజ్ వచ్చింది.. కాల్ గల్స్ కావాలంటే ఇలా చేయండి అంటూ..

అర్ధరాత్రి యువకుడికి వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది.. ఓపెన్ చేసి చూడగా.. అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.. వెంటనే మరో మెసేజ్ వచ్చింది.. కాల్ గల్స్ కావాలంటే ఇలా చేయండి అంటూ.. వావ్‌.. సూపర్‌ అనుకుంటూ..అతను ప్రొసిడ్ అయ్యాడు.. సీన్ కట్ చేస్తే దిమ్మ తిరిగే షాక్ తగిలింది.. వలపు వల మాయ నుంచి తేరుకునే లోపే రెండున్నర లక్షలు మాయమయ్యాయి. తాజాగా.. ఆన్‌లైన్‌ కాల్‌ గాల్స్‌ పేరుతో నిలువునా ముంచేశారు సైబర్‌ నేరగాళ్లు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ ఫోన్‌కి గతేడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కొన్ని ఫొటోలు వచ్చాయి. అందమైన అమ్మాయిల ఫొటోలను షేర్‌ చేసిన ఆగంతకుడు.. వీరిని ఇంటికి పంపుతాం కొంత అడ్వాన్స్‌ ఇవ్వాలని కోరాడు. తాను ఫోన్‌పే చేస్తానని చెప్పాడు బాధితుడు సంజయ్‌. తనకు ఫోన్‌పే లేదని.. కార్డ్‌ డీటైల్స్‌ ఇవ్వాలని కోరాడు. దీంతో సంజయ్‌ కార్డ్‌ డీటెయిల్స్‌ వారికి చెప్పేశాడు. ఆతర్వాత ఓటీపీ చెప్పాడు. ఇలా మూడు దఫాల్లో రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు నేరగాళ్లు. డబ్బులు పంపినా.. అమ్మాయిలను పంపకపోవడంతో.. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సంజయ్‌ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించాడు. జీవన్‌ కుమార్‌ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు పోలీసుల ముందు గోడు వెల్లబోసుకున్నాడు. జీవన్‌ కుమార్‌ రాజస్థాన్‌ కేంద్రంగా ఇలా పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. రంగం లోకి దిగిన పోలీసులు జీవన్ కుమార్ ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి లక్షా, ఎనభై వేల నగదు, రెండు సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం !! భయాందోళనలకు గురైన ప్రజలు..

50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుపెట్టిన మొద‌టి వ్యక్తి.. నేటికీ చెర‌గ‌ని పాద‌ముద్రలు

News Watch: KCR ముందస్తుకు వెళ్ళకపోవచ్చట !! ఇష్టాగోష్ఠిలో తమిళి సై ??

Published on: Jul 26, 2022 08:41 AM