నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
గుంటూరు జిల్లా పొన్నూరులోని సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథ స్వామి 1961లో ప్రారంభించిన పంచాఖండ జ్యోతులు 40 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్నాయి. పంచ భూతాలకు ప్రతీకలైన ఈ ఐదు జ్యోతులు, ఆవు నెయ్యితో నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రజల క్షేమానికి, పాడిపంటల సుభిక్షతకు చిహ్నంగా భావించే ఈ అఖండ జ్యోతులు, భక్తులకు కష్టాలు దరిచేరవని నమ్మకాన్ని ఇస్తున్నాయి.
గుంటూరు జిల్లా పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. తర్వాత కాలంలో ఆంజనేయస్వామి వారిని ఇక్కడ ప్రతిష్టించారు. సహస్రలింగేశ్వరస్వామి వారి ఆలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రారంభించారు. శివ భక్తుల కోరిక మేరకు అఖండ జ్యోతిని స్వామి వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయంలో ఒక్క జ్యోతి కాకుండా పంచ భూతముల పేరుతో ఐదు అఖండ జ్యోతులను ఏర్పాటు చేశారు. నలభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ అఖండ జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్యోతులు ఆరిపోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి జ్యోతికి స్థంభాలు నిర్మించి పరిరక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు వచ్చిన మూడు పూటల జ్యోతులకు ఆవు నెయ్యి వడ్డిస్తారు. దీంతో జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. ఇందుకోసం జగన్నాథ స్వామి ఆశ్రమ ట్రస్ట్ పనిచేస్తుంది. సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా అగ్ని జ్యోతి, మహా విష్ణువు ఆలయం ఎదురుగా జల జ్యోతి , ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వాయు జ్యోతి, కాలభైరవ స్వామి వారి ఆలయం ఎదురుగా ఆకాశ జ్యోతి, గరుత్ముంతుని ఎదురుగా పృథ్వి జ్యోతిని ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి తన యోగ అభ్యాసం ద్వారా తన జ్నానం ద్వారా జ్యోతులను వెలిగించినట్లు భక్తులు చెబుతున్నారు. మానవ సమాజం క్షేమంగా ఉండాలంటే పంచ భూతాలు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ పంచ జ్యోతులు వెలుగుతున్నంత కాలం ఎటువంటి కష్టానష్టాలు దరి చేరవని, ప్రజలంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉంటారని నమ్ముతారు. ఈక్రమంలోనే గత నలభై ఏళ్ళుగా జ్యోతులు నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి. మూడు షిఫ్టుల్లో ఆవు నెయ్యి వడ్డిస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా పూజారులను నియమించారు. వారే జ్యోతులు కొండక్కెకుండా చూస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
సూపర్హిట్ సినిమాకు సీక్వెల్.. టైటిల్ కూడా చెప్పిన రజనీకాంత్
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్

