AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు

అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 5:17 PM

Share

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వ్యాపారి తంగుడు మనోజ్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 30 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు చోరీకి గురయ్యాయి. కుటుంబం ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బీరువా తాళాలు అక్కడే వదిలేయడం, వెండి ఆభరణాలు వదిలేయడంతో ఇది తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పేటలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళాలు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు దోచేశారు. ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన మనోజ్‌ తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి తంగుడు మనోజ్ ఆదివారం మధ్యాహ్నం సోంపేటలోని ఓ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చారు. తర్వాత భార్యతో కలిసి ఒరిస్సా లోని బరంపురంలో ఉన్న మరో ఫంక్షన్ కి హాజరయ్యారు. రాత్రికి తిరిగి సోంపేట లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారి వద్ద బైక్ పై ఎదురుగా అతి వేగంగా వచ్చిన మరో వ్యక్తి మనోజ్ బైక్ ను డీ కొట్టాడు. దాంతో గాయపడిన మనోజ్ ఇంటికి వెళ్ళాక పరాకుగా మాట్లాడటం, మతి స్థిమితం లేనివాడిలా ప్రవర్తించడంతో అతని స్నేహితుడు ఒక RMP డాక్టర్ తీసుకువచ్చి రాత్రికి ట్రీట్ మెంట్ చేయించారు. ఈ విషయం తెలిసి.. పొరుగువీధిలో ఉండే మనోజ్ అన్నయ్య శ్రీను హుటాహుటిని తమ్ముడు ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే మనోజ్ భార్య,పిల్లలు ఆందోళన చెందుతూ కనిపించటంతో వారందరినీ తన ఇంటికి తీసుకుపోయాడు. నిద్రలో మనోజ్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో మరునాడు ఉదయం మనోజ్ తన భార్య,పిల్లలతో తన ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన మనోజ్‌ కుటుంబ సభ్యులకు.. గేటుకు వేసిన తాళం కాకుండా మరో తాళం కనిపించింది. దీంతో ఏంటా అని వారు తాళం పగలగొట్టి చూడగా.. బీరువాలోని బంగారం,నగదు మాయం అయినట్టు గుర్తించారు. సుమారు 30 తులాల బంగారం అభరణాలు,లక్ష రూపాయిలు నగదు పోవడంతో లబోదిబోమన్నారు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ తర్వాత బీరువా తాళాలు ఎక్కడ తీశారో .. అక్కడే పెట్టి వెళ్లారు దొంగలు. దీంతో.. ఇది తెలిసినవారి పనే అయిందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. పైగా.. బంగారు ఆభరణాలు పక్కనే వెండి అభరణాలు ఉన్నా.. దొంగలు వాటిని ముట్టుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగతనంపై సోంపేట సీఐ మంగరాజు, ఎస్‌ఐ లవరాజుతో పాటు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, కంచిలి ఎస్‌ఐ పారినాయుడులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా

సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. టైటిల్‌ కూడా చెప్పిన రజనీకాంత్‌

చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ