AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు

దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు

Phani CH
|

Updated on: Nov 18, 2025 | 5:02 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక మాసం ద్వాదశి నాడు ఉదయం 6:20 గంటలకు, సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్‌ను తాకాయి. సుమారు 9 నిమిషాల పాటు బంగారు వర్ణంలో వెలిగిన దుర్గమ్మను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. ఆలయ చరిత్రలోనే ఇది అద్భుత శుభపరిణామంగా అర్చకులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర కల్పవల్లి, భక్తుల కొంగు బంగారంగా కొలిచే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో వేంచేసి ఉన్న శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. గర్భగుడిలోని మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. కార్తీక మాసం, ద్వాదశి పర్వదినాన,అమ్మవారికి,సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున ఆలయ గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్ ను సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. ఉదయం 6:20 గంటల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తాకిన కిరణాలు సుమారు 9 నిమిషాలు పాటు విగ్రహంపై ప్రసరించాయి. నిత్యం లేత పసుపు ఛాయతో దర్శనం ఇచ్చే దుర్గమ్మ వదనంపై సూర్యుని లేలేత కిరణాలు పడగానే.. బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని కనులారా వీక్షించిన అమ్మవారి భక్తులు భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు.బయట ఉండే క్యూ లైన్ కాంప్లెక్స్, ముఖ ద్వారం,ధ్వజస్థంభం, ముఖ మండపం, అంతరాలయం దాటి గర్భగుడి లోని అమ్మవారిని కిరణాలు తాకటం మహిమగానే భావిస్తున్నారు. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని తాకటం శుభపరిణామం అంటున్నారు ఆలయ అర్చకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాబాలో లంచ్ చేసి బ్యాగ్ మరిచిపోయిన కస్టమర్‌.. ఓపెన్‌ చేయగా

ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు

ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్

భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు

నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే మరి !!