Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనాథ అని చేరదీస్తే.. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తల్లిని చం*పే*సింది

అనాథ అని చేరదీస్తే.. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తల్లిని చం*పే*సింది

Samatha J

|

Updated on: May 21, 2025 | 11:01 AM

అనాధగా దొరికిన బిడ్డను చేరదీసింది ఒక మహిళ. తనకు పిల్లలు లేకపోవడంతో దేవుడే పంపాడని భావించి పెంచి పెద్ద చేసింది. ఆ బిడ్డ పెద్దదై కసాయి కూతురిగా మారింది. ఇద్దరు ప్రియులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం తల్లిని మర్డర్ చేసింది. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకుందామనుకుంది. చివరికి రెండు వారాల తర్వాత ఈ ఘోరతాన్ని ఇన్స్టాగ్రామ్ పట్టించింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశా గజపతి జిల్లా పరిలాకిముడికి చెందిన రాజ్యలక్ష్మి కార్యిక 13 ఏళ్ల క్రితం రోడ్డుపై పడి ఉన్న మూడు రోజుల ఆడ శిశువు కనిపించింది. తమకు ఎలాగో పిల్లలు లేకపోవడంతో ఆ పసికందును అక్కున చేర్చుకుంది. ఆ చిన్నారిని మనమే పెంచుకుందామని భర్తను ఒప్పించింది. దాంతో తనకు ఒక కూతురు ఉందని ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుతూ మురిసిపోయాదామె.

అయితే మరుసటి ఏడాది రాజ్యలక్ష్మి భర్త మరణించాడు. దాంతో ఏడేళ్ల వయసున్న ఆ పసిపాపతో ఒంటరిగా మారింది. అయినా ఆమె ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కష్టపడి ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. కేంద్రీయ విద్యాలయంలో చదివించేందుకు పరిలాకిముడికి వెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ బాలికకు 13 ఏళ్లు కాగా ఎనిమిదవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో అమ్మాయి తనకంటే చాలా పెద్ద వయసున్న రాధ సాహు అనే ఇద్దరు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గమనించిన తల్లి రాజ్యలక్ష్మి కూతుర్ని మందలించింది. తల్లి తన సంబంధానికి అడ్డు వస్తున్న విషయాన్ని రాధకు చెప్పింది ఆ బాలిక. దాంతో తల్లిని చంపేయాలని అలా చేస్తే మన సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని అలాగే ఆమె ఆస్తులను దక్కించుకోవచ్చని ఆ బాలికకు రాధ బాగా నూరిపోశాడు. స్నేహితుడి మాటలతో మంచి చెడులు ఆలోచించని బాలిక గత ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం తన తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయాక రాధ సాహులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం :

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

‘జిలేబీ బేబీ’ పాట పాడిన మిస్‌ యూఎస్‌ఏ వీడియో