మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు

|

Jun 21, 2023 | 11:30 AM

వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా చీకటి బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. అమెరికాలో ప్రముఖ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. మృతదేహాలను ముక్కలుగా కోసి.. వివిధ భాగాలుగా కోసి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు తేలింది.

వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా చీకటి బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. అమెరికాలో ప్రముఖ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. మృతదేహాలను ముక్కలుగా కోసి.. వివిధ భాగాలుగా కోసి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు తేలింది. ఆ మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ దుర్మార్గపు వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతడు మృతదేహాల భాగాలను దొంగలించి తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అనంతరం భార్య, మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో వాటిని అమ్మేవాడు. 2018 నుండి 2022 మధ్య లో ఈ వ్యాపారం లో లక్ష డాలర్ల లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్‌ లాడ్జ్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్‌ యాజమాన్యం సెడ్రిక్‌ని ఉద్యోగం నుంచి తీసేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gunturu Karam: మహేష్‌ సినిమా నుంచి పూజా అవుట్

Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.. రంగంలోకి దిగిన మోదీ..

Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్‌ గర్జన.. Day4 అరాచకం

మెగా ప్రిన్సెస్‌ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..

మరదల్ పుట్టిందని.. భళే హ్యాపీగా ఉన్నావ్‌ కదరా.. వైరల్ అవుతున్న మీమ్

 

 

Follow us on