Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

Phani CH
|

Updated on: Jul 05, 2025 | 11:53 AM

Share

ఓ వైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు. కానీ ఓ బుడతడు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. జూన్ 23న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.

అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలూకు వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు. తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్‌ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి తినడం చాలా ఇష్టమనీ అన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదైనా నేర్పించాలని తెలిపాడు. నెటిజన్ల స్పందన.. ఆ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం అనీ భూకంపం వచ్చినా, తిండిని వదలడు! అని ఒకరు భూకంపం.. బుల్లి బకాసరుడు అంటూ ఇంకొందరు కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్

కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !

Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్‌ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్