AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash raj: ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై.. జస్ట్‌ ఆస్కింగ్ అంటూ పోస్ట్‌.

Prakash raj: ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై.. జస్ట్‌ ఆస్కింగ్ అంటూ పోస్ట్‌.

Anil kumar poka

|

Updated on: Oct 12, 2024 | 7:59 PM

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పై ఓ నిర్మాత అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ వల్ల రూ.కోటి నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ స్టైల్‌లోనే #జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తోపాటు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పై ఓ నిర్మాత అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ వల్ల రూ.కోటి నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ స్టైల్‌లోనే #జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తోపాటు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్‌లో భాగంగా ఉదయనిధితో దిగిన ఫొటోని ఎక్స్‌ వేదికగా ఆయన షేర్‌ చేశారు. ‘‘విత్‌ ఏ డిప్యూటీ సీఎం.. #జస్ట్‌ ఆస్కింగ్‌’’ అని పేర్కొన్నారు. దీనిపై ఓ నిర్మాత స్పందించారు.

ప్రకాశ్‌రాజ్‌ పక్కన కూర్చొన్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారనీ ప్రకాశ్‌రాజ్‌ అయితే డిపాజిట్లు కూడా కోల్పోయారనీ ఎద్దేవా చేశారు. అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసమనీ అన్నారు. ఇక ఓ సినిమా సెట్‌లో తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా కారవాన్‌ నుంచి ఎక్కడికో వెళ్లిపోయి కోటి రూపాయల నష్టం వాటిల్లేలా చేశారనీ ప్రకాశ్‌రాజ్‌ను కడిగిపారేశారు. అలా చేయడానికి కారణం ఏమిటి? #జస్ట్‌ ఆస్కింగ్‌!! కాల్‌ చేసి జరిగింది వివరిస్తానని చెప్పిన ప్రకాశ్‌రాజ్.. అసలు ఫోన్‌ చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమా విషయంలో ఇలా జరిగిందనేది నిర్మాత చెప్పలేదు. ‘మార్క్ ఆంటోని’ సినిమా నిర్మాత వినోద్‌ కుమార్‌ ప్రకాశ్‌రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సమానత్వం గురించి మాట్లాడుతుంటారనీ అన్నారు. మరొకరు ఉన్నారనీ వారు సనాతనధర్మం గురించి ఏదో మాట్లాడుతుంటారు అని సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.