రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. తమిళనాడులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు భలే షాకిచ్చారు. చెన్నైలోలోని చెన్నిమలై సమీపంలోని వెల్లోట్కు చెందిన పార్థిబన్
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. తమిళనాడులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు భలే షాకిచ్చారు. చెన్నైలోలోని చెన్నిమలై సమీపంలోని వెల్లోట్కు చెందిన పార్థిబన్ అనే 26 ఏళ్ల యువకుడు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో 10 రూపాయల ఛాలెంజ్ని స్వీకరించాడట. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటీపై కూర్చుని పార్థిబన్ తన ఒంటిపై ఓ బకెట్ నీళ్లు కుమ్మరించుకున్నాడు. అతని స్నేహితులు ఈ తతంగాన్ని వీడియో తీశారు. సిగ్నల్ పడిపోయినా అతను ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. నిత్యం జనసంచారంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్థిబన్ చేసిన ఫీట్ జనాలకు చిర్కెత్తుకొచ్చింది. ఇక ఈ విషయమంతా పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడికి ఏకంగా 3500 రూపాయల జరిమానా విధించారు. ఇకపై ఇలాంటివి చెయ్యొద్దని అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

