కేజీ కజ్జికాయలు రూ.50 వేలా.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు వీడియో
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలంతా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగితేలారు. ఇక హోలీ వేళ.. నోరు తీపి చేసుకునేందుకు పక్కాగా స్వీట్ ఉండాల్సిందే..! ఈ క్రమంలో మార్కెట్లో రకరకాల స్వీట్లు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ దుకాణదారు తయారుచేసిన కజ్జికాయలు నోరూరిస్తున్నాయి. కానీ, వాటి ధర చూసి కస్టమర్లు అవాక్కవుతున్నారు. అవును మరి, ఆ కజ్జికాయల ధర కేజీ రూ.50వేలట. ఎందుకు.. బంగారంతో ఏమైనా తయారుచేశారా? అంటే అవుననే అంటున్నారు ఆ యజమాని. 24 క్యారెట్ల పుత్తడితో చేసిన ఈ మిఠాయిలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్ దుకాణదారు బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారు. వీటి ధర కేజీ రూ.50వేలు అని బోర్డు పెట్టారు. ఒక్క స్వీటు చాలనుకుంటే దానికి రూ.1300లకు చెల్లించాలి. ఆ కజ్జికాయలపైన 24 క్యారెట్ల బంగారు పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్ను నింపినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ మిఠాయిల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు లఖ్నవూలోని మరో స్వీట్ షాపు దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసి రికార్డు సృష్టించింది. ఆరు కేజీల బరువుతో 25 అంగాళాలు పొడవు ఉన్న ఈ కజ్జికాయ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటర్ తెలిపారు. మునపటి రికార్డులను ఈ కజ్జికాయ బద్దలుకొట్టిందని వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఈ మిఠాయిని మువ్వన్నెల రంగుల్లో ప్రత్యేకంగా తయారు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వైరల్ వీడియోలే వరుడికి విలన్లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!

