రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!
ఏపీలో అంతరించిపోతున్న ఓ పక్షి జాడ కనిపెట్టడానికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. మీరు వింటున్నది నిజమే.. ఆ పక్షి కోసం ఏకంగా రూ.50కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అత్యంత అరుదైన కలివికోడి పక్షిని వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో ఇటీవల గుర్తించారు. అంతరించిపోయిందని భావించిన ఈ పక్షిని, పక్షి పరిశోధక బృందం జులై, ఆగస్టు నెలల్లో వారాల తరబడి పరిశోధనలు చేసి కనిపెట్టారు.
దీని కూతను కూడా రికార్డు చేశారు. ఈ కలివికోడి పక్షిని మొదట 1848లో పెన్నా నది దగ్గర చూశారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డిపల్లెకు చెందిన చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత పక్షి శాస్త్రవేత్తలు ఈ జాతి అంతరించిపోయిందని చెప్పారు. అంతరించిపోతున్న ఓ పక్షి జాతిని సంరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లల్లో ఖర్చు చేస్తున్నాయి. ఏకంగా 3 వేల ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేశాయి. ఎనభైలలోనే అంతరించిపోయిందనుకున్న పక్షి ‘కలివికోడి’ కోసం తిరుపతి ఎస్వీయూ పరిశోధకుల బృందం నాలుగేళ్ల పాటు అన్వేషణ జరిపింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబయి నేచురల్ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర, కూతను రికార్డు చేసింది. జిల్లాలోని కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షుల జాడ కనిపించడంతో ప్రభుత్వం అక్కడ 3 వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కలివికోడి ఉనికిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వరకూ వెచ్చించాయి. పక్షి పరిశోధక బృందం సభ్యులు గత జులై, ఆగస్టు నెలల్లో అక్కడ వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించారు. వాటి కూతను రికార్డు చేశారు. కలివికోడి సుమారు 27 సెంటీమీటర్ల పొడవు ఉంటుందని, దీని కూత దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎగిరే సామర్థ్యం లేకపోవడంతో కలివికోడి దట్టమైన పొదల్లో నివసిస్తుంటుందని తెలిపారు. పగటిపూట నిద్రించడం, రాత్రిపూట ఆహారం కోసం అన్వేషించడం కలివికోడి లక్షణమని, గులక రాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్డిగా కెరీర్ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్ దుస్థితి ఇదీ
గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

