పసిపిక్ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?
ప్రపంచ పటం ముఖచిత్రం మారబోతుందా? భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఖండాలు ఎన్ని అంటే ఏడు అని ఎల్కేజీ స్టూడెంట్ కూడా టక్కున సమాధానం చెబుతాడు. కానీ భవిష్యత్తులో ఖండాలు ఎన్ని అంటే ఎనమిది అని చెప్పుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పూర్తి గా అంతరించిపోయి, భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ ఒక చోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20-30 కోట్ల సంవత్సరాల్లో కొత్తగా సూపర్ కాంటినెంట్ ఆవిర్భవిస్తుంది. ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ను వినియోగించి ఈ అంచనాకొచ్చారు. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని, ఇది ఏర్పడటం కోసం 200 కోట్ల సంవత్సరాల కాలంలో భూమిపైగల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నట్లు గుర్తించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు కూడా మరో 20 కోట్ల సంవత్సరాల్లో మళ్లీ ఒక చోటుకు చేరుతాయని చెప్పారు. ఫలితంగా ఏర్పడే కొత్త సూపర్ కాంటినెంట్కు అమేసియా అని పేరు పెట్టినట్లు తెలిపారు. అమెరికా, ఆసియా ఢీకొన్నపుడు పసిఫిక్ మహాసముద్రం అంతరించిపోతుందని కొందరు విశ్వసిస్తున్నందువల్ల ఈ పేరు పెట్టామన్నారు. పసిఫిక్ మహాసముద్రం మూతపడితే, ఆస్ట్రేలియా మొదట ఆసియాను ఢీకొడుతుందని, ఆ తర్వాత అమెరికా, ఆసియా ఖండాలను కలుపుతుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్లో
కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్కు తనేంటో చూపించేందుకు రెడీ!
ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

