AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది

మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది

Phani CH
|

Updated on: Apr 28, 2024 | 6:36 PM

Share

హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75 లక్షల రూపాయల విలువైన 700 పైగా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అన్‌లాక్ చేసి సూడాన్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వివారాలు ప్రకారం..

హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75 లక్షల రూపాయల విలువైన 700 పైగా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అన్‌లాక్ చేసి సూడాన్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వివారాలు ప్రకారం.. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి సెల్‌ఫోన్లే కాకుండా నగదు చోరీ కూడా చేస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. రాత్రి 10 గంటలు తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మూడు కమిషనరేట్ లలో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు

పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??

విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??

Published on: Apr 28, 2024 06:36 PM