బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవగానే
ఇద్దరు వ్యక్తులు బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో విషపూరిత, అరుదైన పాములను తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 అరుదైన పాములు, తాబేళ్లను శనివారం శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నిందితులు ముంబైకి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీగా గుర్తించారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-1066 విమానంలో శంషాబాద్లో దిగారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో ఎయిర్పోర్ట్ అధికారులు వారిని చెక్ చేశారు. వారి లగేజ్లో ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్లు, మూడు స్పైడర్ టెయిల్డ్ హార్మ్డ్ వైపర్లు, ఆరు తాబేళ్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిబయట బట్టలు ఆరేస్తున్నారా.. జాగ్రత్త
బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్క చూస్తే..
వాటర్ బాటిల్తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్..!
మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!
ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

