Telangana: ‘ఈ బస్సు నడపడం నా వల్ల కాదు..’ నడిరోడ్డుపై ఆపేసిన డ్రైవర్
నడిరోడ్డుపై బస్సును ఆపేశాడు డ్రైవర్. ఇలా బస్సును నడపలేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని తెగేసి చెప్పాడు. చివరికి....
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఆర్టీసీ బస్ను నడి రోడ్డుపై నిలిపివేశాడు డ్రైవర్. సిరిసిల్ల నుంచి వరంగల్కి వెళ్తున్న ఆర్టీసీ బస్ హుజురాబాద్ బస్టాండ్లో ప్రయాణీకులను ఎక్కించుకుని స్టార్ట్ అయ్యింది. బస్లో 55 మంది కెపాసిటీకి గాను 110 మంది ఎక్కారు. ఓవర్ లోడ్ అయిందని.. ఎంత చెప్పినా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక అలానే బయటకు పోనిచ్చాడు డ్రైవర్. బస్సు రన్నింగ్లో, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రయాణీకులు దిగాలని డ్రైవర్ కోరారు. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోడంతో డ్రైవర్ వరంగల్ రోడ్పై బస్సును నిలిపివేశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

